
హైదరాబాద్ : పలు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ శుక్రవారం తన తొలి చార్జిషీట్ దాఖలు చేసింది.కాగా శనివారం ఈడీ కూడా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. సాఫ్ట్ కాపీతో కూడిన హార్డ్ డిస్క్ సహా చార్జిషీట్ కాపీలను ఈడీ కోర్టుకు సమర్పించింది. అటు, ఈ కేసులో ఏ1 నిందితుడు విజరు నాయర్కు కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. విజరు నాయర్ కస్టడీ ముగియడంతో అతడిని ఈడీ అధికారులు శనివారం కోర్టులో హాజరుపరిచారు. అతడికి రౌస్ అవెన్యూ కోర్టు డిసెంబరు 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దాంతో విజరు నాయర్ ను అధికారులు తీహార్ జైలుకు తరలించారు.