ఆర్మీలో చేరతారా ? వార్త హల్‌ చల్‌ – నిజమెంత ?

అమరావతి : భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ … ఆర్మీలో చేరతారా ? నోటిఫికేషన్‌ వచ్చింది అంటూ … సోషల్‌ మీడియాలో ఓ ప్రచారం వైరలవుతోంది. అదిగో పులి.. అంటే ఇదిగో తోక.. అన్న చందంగా … ఇంతలో ఈ వార్త కాస్తా సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేసింది. ప్రాదేశిక (టెర్రిటోరియల్‌) సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకు ఆహ్వానం పలికినట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇండియన్‌ ఆర్మీ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని కూడా పెద్ద ఎత్తున వైరల్‌ అవుతోంది. దీనిలో 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లలోపు వారికి అవకాశం ఉంటుందని, విద్యార్హత డిగ్రీ, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, ఆదాయం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని కూడా పేర్కొన్నారు. కానీ.. ఆర్మీ వెబ్‌ సైట్‌లో కానీ.. ఆర్మీ అధికారులు కానీ.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజల మూడ్‌ను తమవైపు తిప్పుకోవడానికి, భారత దేశ ఆర్మీ పాటవం సరిపోవడం లేదన్న ప్రచారం చేసేందుకు జరుగుతున్న కుయుక్తి ప్రచారంగా ప్రభుత్వం పేర్కొంది. ఇక… టెర్రిటోరియల్‌ ఆర్మీ వ్యవహారానికి వస్తే.. సైనిక అధికారులను ఏటా రెండు సార్లు రిక్రూట్‌ మెంట్‌ చేసుకుంటారు. ఇది సాధారణ ప్రక్రియ. దీనికి ప్రత్యేకంగా ఇచ్చే వేతన, భత్యాలు ఉండవు. అవసరమైనప్పుడు పిలిచి.. భోజనం పెట్టి.. గౌరవార్థసేవలను వినియోగించుకుంటారు. దీని ప్రకారం.. ఈ ఏడాది మార్చి 26 నే టెర్రిటోరియల్‌ రిక్రూట్‌మెంటు కోసం ఆర్మీ ప్రకటన ఇచ్చింది. అయితే.. దీనిని లేటెస్టు రిక్రూట్‌ మెంటు అంటూ.. ప్రచారం చేస్తున్నారు.

➡️