Grok 3 :’భూమిపైనే అత్యంత తెలివైన ఎఐ గ్రోక్‌ 3

  • ఎలన్‌ మస్క్‌ కీలక ప్రకటన

న్యూయార్క్‌ : ప్రపంచంలో ఉన్న టెక్‌ దిగ్గజాలన్నీ ఎఐ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ లో పోటీపడుతున్న నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన చేశారు. మస్క్‌ నేతత్వంలోని కత్రిమ మేధ సంస్థ ‘ఎక్స్‌ఏఐ’ అత్యంత అధునాతనమైన గ్రోక్‌ 3 సేవలను అందుబాటులోకి తీసుకురానుందని సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. భూమిపైన అత్యంత తెలివైన ఎఐ సాధనంగా దీన్ని ఆయన అభివర్ణించారు. భారత కాలమానం ప్రకారం … మంగళవారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు ఈ కొత్త మోడల్‌ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఇప్పటికే గ్రోక్‌ చాట్‌బాట్‌ సేవలు విస్తతంగా ప్రాచుర్యం పొందాయి. చాట్‌ జిపిటికి పోటీగా మార్కెట్లోకి వచ్చిన గ్రోక్‌, మెరుగైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంది. తాజాగా ‘ఎక్స్‌’ వేదికగా గ్రోక్‌ 3 విడుదల కానున్నట్లు మస్క్‌ ప్రకటించారు. అయితే.. దీని సామర్థ్యాలకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. టెక్‌ నిపుణుల అభిప్రాయానుసారం… ఈ కొత్త మోడల్‌ టెక్ట్స్‌-టు-వీడియో వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉండే అవకాశముంది. ఈ అప్‌గ్రేడ్‌తో, గ్రోక్‌ 3 ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన జిపిటి-4, గూగుల్‌ జెమిని వంటి ఏఐ మోడళ్లకు ప్రధాన పోటీదారుగా నిలవనుంది. ప్రస్తుతం కత్రిమ మేధ విభాగంలో పోటీ తీవ్రంగా పెరిగింది. ఓవైపు ఓపెన్‌ఏఐ తన చాట్‌జీపీటీ మోడళ్లను నిరంతరం అభివద్ధి చేస్తుండగా, గూగుల్‌ జెమినీని మరింత మెరుగుపరుస్తోంది. మెటా తన ఎల్‌ఎల్‌ఎఎంఎ సిరీస్‌ను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో, ఎలాన్‌ మస్క్‌ గ్రోక్‌ 3ను ప్రవేశపెట్టడం టెక్‌ ప్రపంచంలో కీలక పరిణామంగా నిలిచింది.

➡️