
విశాఖపట్నం: ఎవరు అడ్డుపడినా విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి పునరుద్ఘాటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజధాని తరలింపు ఆలస్యమవుతోందన్నారు. ఈ సదర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నదుల్ని, కాలువలను ఆక్రమించుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి కోర్టులో తాత్కాలిక ఊరటే దక్కిందని చెప్పారు. పంట కాల్వను ఆక్రమించిన అయ్యన్నకు చట్టపరంగా శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయాన్ని పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారన్నారు. అధినేత ఆదేశాల ప్రకారమే తామంతా నడుచుకుంటామన్నారు.