Sep 18,2023 10:53

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌ను ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సీజ్‌ చేశారు. పాడైన ఆహార పదార్థాలను విక్రయించి వినియోగదారుల అనారోగ్యానికి గురవుతున్నారనే ఫిర్యాదులు రావడంతో... జిహెచ్‌ఎంసి అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి హోటల్‌ను సీజ్‌ చేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న ఆల్ఫా హౌటల్‌ నిత్యం రద్ధీతో ఉంటోంది. ఇక్కడ ఆహారపదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోగా, నిల్వఉన్న పదార్థాలను విక్రయించడంతో అవి అనారోగ్య సమస్యకు దారితీస్తున్నాయి. అల్ఫా హోటల్‌లో కీమా రోటీ తిన్న మహ్మద్‌ అనే వ్యక్తి కొద్ధిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరోచనాలతో అల్ఫా హోటల్లోనే విలవిల్లాడిపోయాడు. పాడైన రోటీ దుర్వాసన వస్తుందని వినియోగదారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫుడ్‌ సేఫ్టీ అధికారులు అల్ఫా హౌటల్‌కు చేరుకుని తనిఖీ చేపట్టారు. అల్ఫా హౌటల్‌ యజమాని జమాలుద్ధీన్‌పై కేసు నమోదు చేశారు.