
న్యూఢిల్లీ : వచ్చే రెండు వారాల్లోనే బిఎస్ఎన్ఎల్ 4జి నెట్వర్క్ సేవలను ట్రయల్ రన్గా ప్రారంభించనున్నామని టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఒక్కటి, రెండేళ్లలో 10 కోట్ల మంది 4జి వినియోగదారులను చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం దేశంలో 110 కోట్ల మంది వినియోగదారులుండగా.. అందులో 76.9 కోట్ల 4జి ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ సంస్థలకు మొత్తంగా 10.5 కోట్ల టెలికం సబ్స్రయిబర్లు ఉన్నారు. మొత్తం మార్కెట్లో 9.1 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి బిఎస్ఎన్ఎల్ 5జి సేవలను ప్రారంభించే యోచనలో ఉన్నామని మంత్రి వైష్ణవ్ తెలిపారు.