
- ఒక్కో మద్యం బాటిల్ పై రూ.10 విధింపు
హిమాచల్ప్రదేశ్ : హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం బాటిళ్లపై కౌ సెస్ (ఆవుల సుంకం) వసూలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఒక్కో బాటిల్పై రూ.10 సెస్ విధిస్తున్నట్టు బడ్జెట్లో పేర్కొంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి ఏటా అదనంగా రూ.100 కోట్లు వస్తాయని అంచనా వేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సెస్ను విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ రూ.53,413 కోట్లుగా ఉంది. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు 'హిం-గంగా' ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం రూ.500 కోట్లను ఖర్చు చేయనున్నారు. కాగా, 2,31,000 మందికి ప్రతి నెల రూ.1,500 పింఛన్ అందించనున్నారు.