
హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. మే 16 నుంచి జూన్ 10 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. మే 20 నుంచి జూన్ 11 వరకు వెబ్ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు. జూన్ 16న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.
రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు జూన్ 16 నుంచి 26 వరకు ఉంటాయన్నారు. రెండో విడత వెబ్ఆప్షన్లకు జూన్ 16 నుంచి 27 వరకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జూన్ 30న రెండో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. మూడో విడత రిజిస్ట్రేషన్లు జులై 1 నుంచి 5 వరకు నిర్వహిస్తామని.. జులై 1 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందని చెప్పారు. జులై 10న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. జులై 17 నుంచి డిగ్రీ మొదటి విడత సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని కన్వీనర్ వెల్లడించారు.