Sep 22,2022 20:57

హైదరాబాద్‌ : రానా గ్రూప్‌ సంస్ధ ఎరీషా ఇ-మొబిలిటీ తన ఎలక్ట్రిక్‌ కార్గో ఇ-సుపీరియర్‌, ప్యాసెంజర్‌ వాహన మూడు చక్రాల ఆటో రిక్షా ఇ-స్మార్ట్‌ల బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే అక్టోబర్‌ 2 నుంచి ముందస్తు బుకింగ్స్‌ కోసం అనుమతించినట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్‌ ఆటోను భారత మార్కెట్‌ కోసం తీర్చిదిద్దామని రానా గ్రూప్‌ సిఎండి దర్శన్‌ రానా తెలిపారు. ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 120-142 కిలోమీటర్ల ప్రయాణిస్తుందన్నారు.