
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ 1 గనిలో శనివారం పేలుడు సంబవించి సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. జైనాథ్ కుమార్(28) అనే ట్రైనీ వెల్డర్ రాత్రి షిప్ట్లో సీహెచ్పీ సర్పేస్ ఫీడర్ ఫైర్ ఎక్సనెంజర్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవాశాత్తు గ్యాస్ పేలింది. ప్రమాదంలో కొత్తగూడెం మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన జైనాథ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఏరియా హాస్పిటల్కు తరలించగా పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు దృవీకరించారు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.