
హైదరాబాద్ : హైదరాబాద్లో మహిళల భద్రత కోసం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు షీ షటిల్ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యురిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాయదుర్గం జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో ఐదవ ఉమెన్స్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డిజిపి అంజనీ కుమార్ ఉచిత బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపి స్టీఫెన్ రవీంద్ర, ఎస్సి ఎస్సి సెక్రటరీ కఅష్ణ ఏదుల, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సర్వీసు ఉదయం 2 సార్లు.. సాయంత్రం 2 సార్లు...
నిర్వాహకులు మాట్లాడుతూ .... మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ ఉచిత బస్సు సర్వీసు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారని తెలిపారు. మహిళలకు అన్నీ సౌకర్యాలు ఇందులో ఉండేటట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. మహిళల భద్రతకోసం బస్సులో ఓ సెక్యూరిటీగార్డు ఉంటారని చెప్పారు. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లు ప్రయాణిస్తుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.