
- తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రధాని మోడీ దెబ్బతీస్తున్నారన్నారు. అదే సమయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకోలేదనడం సరికాదని, ఇది అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మోడీ తెలంగాణ విరోధి అంటూ ట్వీట్ను ప్రారంభించారు. అంతకుముందు, కాంగ్రెస్ అర్ధ శతాబ్ధపు పాలన మోసం.. వంచన.. ద్రోహం.. దోఖాలమయం.. అంటూ విమర్శలతో ట్వీట్ చేశారు. పూర్తి ట్వీట్ చూడండి..
మోసం..వంచన.. ద్రోహం..దోఖాలమయం
— KTR (@KTRBRS) September 18, 2023
కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా..!
ఇది..మీ కపట కథలు..కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన
తెలివైన తెలంగాణ గడ్డ..!
కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవ్ ఇక్కడ..!
........
రాబందుల రాజ్యమొస్తే
రైతుబంధు రద్దవడం గ్యారెంటీ..!
కాలకేయుల కాలం వస్తే
కరెంట్ కోతలు..కటిక…