
ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ స్ట్రాటజిక్ కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు, పేదలకు మధ్య చిచ్చు పెట్టడమే ఈ జోన్ తీసుకురావడం వెనుక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. నాడు సీఆర్డీఏ విధివిధానాల్లో భాగంగా 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించడం జరిగిందని, కానీ వైసీపీ ఆర్-5 జోన్ పేరిట ఇరువర్గాల ప్రయోజనాలను కాలరాసేందుకు కుట్ర పన్నిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇరుపక్షాల మేలు కోరి టీడీపీ నిర్ణయం తీసుకుంటే, వైసీపీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. అటు పేదలను మోసం చేయడమే కాకుండా, ఇటు రైతులకు అన్యాయం చేస్తోందన్నారు.