May 29,2023 21:51

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జూన్‌ 7న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలూ ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని సిఎస్‌ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.