
ఆగ్రా (ఉత్తరప్రదేశ్) : ఓ పిల్లాడు తన తండ్రి మొబైల్లో ఆన్లైన్ గేమ్ ఆడి ఏకంగా రూ.39 లక్షలు పోగొట్టిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో చోటుచేసుకుంది.
తాజ్నాగ్రికి చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు తన తండ్రి మొబైల్లో బ్యాటిల్ గ్రౌండ్ అనే ఆన్లైన్ పెయిడ్ గేమ్ను ఇన్స్టాల్ చేశాడు. ఆ తర్వాత డబ్బులు చెల్లించే ఆప్షన్ను ఆటోమోడ్లో పెట్టాడు. పిల్లాడు చాలా సార్లు గేమ్ ఆడటంతో ఆడిన ప్రతీసారి ఆటోమోడ్లో డబ్బులు చెల్లింపలయ్యేవి. కొన్ని రోజులకు పిల్లాడి తండ్రి తన బ్యాంకు ఖాతాలో డబ్బులు చెక్ చేయడానికి వెళ్లగా... రూ.39 లక్షలు మాయమైనట్లు గమనించారు. దీనిపై సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి సింగపూర్లోని క్రాఫ్టన్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రాఫ్టన్ కంపెనీపై మోసం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.