
న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో కృత్రిమ మేథస్సు వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని పలువురు పరిశ్రమ నేతలు, విద్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు వారంతా కలిసి మంగళవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. 'మహమ్మారి, అణుయుద్ధం వంటి ఇతర సామాజిక స్థాయి ప్రమాదాలతోపాటు ప్రపంచ ప్రాధాన్యతగా ఉంటేనే 'కృత్రిమ మేథస్సు ప్రమాదాన్ని తగ్గించడం సాధ్యం.' అని సెంటర్ ఫర్ ఎఐ సేఫ్టీ (సిఎఐఎస్) వెబ్సైట్ ప్రకటన పేర్కొంది. ఇక ఎఐ (కృత్రిమ మేథస్సు) నిపుణులు, పాత్రికేయులు, విధాన నిర్ణేతలు, ప్రజలు కృత్రిమ మేథస్సు నుండి ముఖ్యమైన మరియు తక్షణ నష్టాల గురించి విస్తృతంగా చర్చిస్తున్నారు.' అని సిఎఐఎస్ వెబ్సైట్ తెలిపింది.
కాగా, కృత్రిమ మేథస్సు ప్రమాదానికి సంబంధించిన బహిరంగ లేఖపై.. మూడు ప్రముఖ ఎఐ కంపెనీల ఉన్నతాధికారులతో సహా 350 కంటే ఎక్కువ ఎఐ అధికారులు, పరిశోధకులు, ఇంజనీర్లు సంతకం చేశారు. అలాగే ఓపెన్ ఎఐ సిఇఓ సామ్ ఆల్ట్మాన్, గూగుల్ డీప్ మైండ్ సిఇఓ డెమిస్ హస్సాబిస్, ఆంత్రోపిక్ సిఇఓ డారియో అమోడీలు కూడా ఈ బహిరంగ లేఖపై సంతకం చేసినట్లు ప్రముఖ మీడియా ఛానెల్ నివేదించింది. అలాగే కృత్రిమ మేథస్సు సాంకేతిక పరిశ్రమలో ఆయుధ పోటీని పెంచడంలో సహాయపడింది. దీనికి ప్రతిస్పందనగా చట్టసభ సభ్యులు, న్యాయవాద సమూహాలు, టెక్ ఇన్సైడర్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన సిఎన్ఎన్ అనే టెలివిజన్ ఛానెల్ పేర్కొంది. కేవలం మీడియా వర్గాలు మాత్రమే కాదు.. ఈ కృత్రిమ మేథస్సుపై సిఎఐఎస్ డైరెక్టర్ డాన్ హెండ్రిక్స్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. 'కృత్రిమ మేథస్సు వల్ల కేవలం ప్రమాదం మాత్రమే కాదు. దైహిక పక్షపాతం, తప్పుడు సమాచారం, హానికరమైన ఉపయోగం, సైబర్ ఎటాక్లు, ఆయుధీకరణ ఇవన్నీ ముఖ్యమైన ప్రమాదాలు' అని ఆయన హెండ్రిక్స్ మంగళవారం ట్వీట్లో తెలిపారు.