
నటసింహ నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. గోప్చంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ మూవీకి సంబందించిన అప్డేట్లతో మేకర్స్ ఎప్పటికప్పుడు అభిమానులకు ఆనందపరుస్తున్నారు. ఈ క్రమంలో వీరసింహారెడ్డి' ఫస్ట్ సింగిల్ జై బాలయ్య నవంబర్ 25న లాంచ్ కానునట్లు తెలిపారు. ఈ సందర్భంగా ''రాజసం నీ ఇంటి పేరు' అని పేర్కొంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లో బాలకృష్ణలుక్ ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేసింది. వైట్ అండ్ వైట్ డ్రెస్లో ట్రాక్టర్ నడుపుతూ రాయల్గా కనిపించారు బాలకష్ణ. చాలా సందర్భాల్లో బాలకృష్ణ అభిమానులు నినాదం 'జై బాలయ్య'. ఇదే నినాదంతో అఖండ లో పాట కూడా వచ్చింది. సూపర్హిట్ పాటను స్కోర్ చేసిన ఎస్ థమన్ ఈసారి వీరసింహారెడ్డి కోసం మరో మాస్ నంబర్ జై బాలయ్యను స్కోర్ చేశారు. నందమూరి అభిమానులకు ఇది మరో బొనాంజా. చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజరు, వరలక్ష్మి శరత్కుమార్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.