Mar 19,2023 21:21
  • హాజరు కానున్న లక్షలాది మంది రైతులు
  • ఎస్‌కెఎం నేతల ప్రకటన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మోడీ సర్కార్‌ నమ్మక ద్రోహం, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం కిసాన్‌ మహాపంచాయత్‌ నిర్వహించనున్నట్లు ఎస్‌కెఎం నేతలు ప్రకటించారు. ఆదివారం నాడిక్కడ ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (పిసిఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌కెఎం నేతలు హనున్‌ మొల్లా, దర్శన్‌ పాల్‌, భూటా సింగ్‌, మేథాపట్కర్‌, ఆశిష్‌ మిట్టల్‌, సాహు తదితరులు మాట్లాడారు. పది డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరగనును కిసాన్‌ మహాపంచాయత్‌కు హాజరయ్యేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు. వ్యవసాయ ఆదాయం తగ్గడం, కార్పొరేట్‌ లాభం కోసం అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూములు, అటవీ భూములు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం లాక్కోవడానిు తీవ్రంగా ఖండించారు. రైతులు, ఆదివాసీ రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ, వలస కార్మికులు, గ్రామీణ కార్మికులు, నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, క్షీణిస్తును కొనుగోలు శక్తి అంశాలపై కిసాన్‌ మహా పంచాయత్‌లో లేవనెత్తుతామని తెలిపారు. 2021 డిసెంబర్‌ 9న ఎస్‌కెఎంకి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎస్‌కెఎం నేతలు పునరుద్ఘాటించారు. వ్యవసాయ రంగంలో పెరుగుతున్న ఇన్‌పుట్‌ ఖర్చులు, రైతులు తమ పంటలకు లాభదాయకమైన ధరలు పొందకపోవడం కారణంగా, దేశంలో 80 శాతం కంటే ఎక్కువ మంది రైతులు భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు బలవుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎస్‌కెఎంతో చర్చించిన తరువాతే విద్యుత్‌ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని రాతపూర్వక హామీ ఇచ్చిందని, ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిందని విమర్శించారు. వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విద్యుత్‌, గ్రామీణ గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపారు. కరువు, వరదలు, వడగళ్ల వాన, అకాల వర్షాలు, పంటలకు వచ్చే తెగుళ్లు, అటవీ జంతువులు, విచ్చలవిడిగా పశువుల సంచారం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను భర్తీ చేయడానికి, అన్ని పంటలకు సార్వత్రిక, సమగ్ర, సమర్థవంతమైన పంటల బీమా, పరిహారం ప్యాకేజీని అమలు చేయడానికి పిఎంఎఫ్‌బివైని పునరుద్ధరించాలని కోరారు.

  • డిమాండ్లు

1. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా సి2ప్లస్‌
50 శాతం ఫార్ములాను ఉపయోగించి అనిు పంటలకు ఎంఎస్‌పి హామీ ఇచ్చే చట్టం రూపొందించి అమలు చేయాలి. హామీ ఇచ్చిన పంట సేకరణ వెంటనే చేయాలి.
2. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా ఎస్‌కెఎం ప్రతినిధులను చేర్చడంతోపాటు రైతులకు తగిన ప్రాతినిధ్యంతో ఎంఎస్‌పిపై మాత్రమే కొత్త కమిటీని తిరిగి ఏర్పాటు చేయాలి.
3. రైతులందరి రుణాలనిుంటినీ తక్షణమే మాఫీ చేయాలి. ఎరువులతో సహా ఇన్‌పుట్‌ ధరలను తగ్గించాలి.
4. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి సూచించిన విద్యుత్‌ సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకోవాలి.
5. లఖింపూర్‌ ఖేరీ జిల్లా టికోనియాలో నలుగురు రైతులు, జరులిస్టు హత్యకేసులో ప్రధాన సూత్రధారి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాని మంత్రివర్గం నుంచి తొలగించి, అరెస్టు చేసి జైలుకు పంపాలి.
6. రైతు ఉద్యమంలో అమరులైన రైతుల కుటుంబాలతోపాటు లఖింపూర్‌ ఖేరీలో అమరులైన, గాయపడిన రైతుల కుటుంబాలకు పరిహారం, పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి.
7. పంట బీమా, పరిహారం ప్యాకేజీనిఅమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన పిఎంఎఫ్‌బివైనిపునరుద్ధరించాలి. నష్టానిు వ్యక్తిగత ప్లాట్ల ఆధారంగా అంచనా వేయాలి.
8. రైతులు, వ్యవసాయ కూలీలందరికీ నెలకురూ.5,000 రైతు పెన్షన్‌ పథకానిు వెంటనే అమలు చేయాలి.
9. రైతు ఉద్యమం సందర్భంగా బిజెపి పాలిత రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రైతులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
10. సింఘూ సరిహద్దు వద్ద అమరులైన రైతుల స్మారక చిహుం నిర్మాణానికి భూమి కేటాయించాలి.