సింగిల్‌ ఛార్జ్‌తో 449 కిలోమీటర్లు

  • ఎంజి విండ్‌సోర్‌ ఇవి ప్రో ఆవిష్కరణ

న్యూఢిల్లీ: జెఎస్‌డబ్ల్యు ఎంజి మోటార్‌ కొత్తగా విండ్‌సోర్‌ ఇవి ప్రో వర్షన్‌ను ఆవిష్కరించింది. మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసిన ఈ కొత్త కారు ఒక్క సారి ఛార్జింగ్‌తో 449 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ఆ సంస్థ తెలిపింది. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.17.49 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధర తొలి 8,000 మంది కస్టమర్లకు మాత్రమేనని ఎంజి మోటార్‌ తెలిపింది. ఇందుకోసం మే 8 నుంచి బుకింగ్స్‌ తెరుస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత విండ్‌సోర్‌ స్టాండర్డ్‌ మోడల్‌తో పోలిస్తే అదనంగా కొన్ని ఫీచర్లను జోడించినట్లు పేర్కొంది. ప్రో వేరియంట్‌లో 52.9కిలోవాట్‌ బ్యాటరీని అమర్చింది.

➡️