కోల్‌ ఇండియాకు రూ.9,593 కోట్ల లాభాలు

కోల్‌కతా : దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు కోల్‌ ఇండియా 2024-25 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 12 శాతం వృద్ధితో రూ.9,593 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.8,530 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరం 2024-25కు గాను తుది డివిడెండ్‌ కింద ప్రతీ ఈక్విటీ షేర్‌పై రూ.5.15 చెల్లించడానికి కోల్‌ ఇండియా బోర్డు నిర్ణయించింది. ఎజిఎం తర్వాత ఈ మొత్తాన్ని 30 రోజుల్లో చెల్లించనుంది. గడిచిన క్యూ4లో కంపెనీ మొత్తం వ్యయాలు రూ29,057 కోట్లకు పెరిగాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.28,950 కోట్లుగా నమోదయ్యాయి. 2024-25లో మొత్తంగా 781.05 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది. ఇంతక్రితం 2023-24లో 773.65 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరిగింది. బుధవారం ఎన్‌ఎస్‌ఇలో కోల్‌ ఇండియా షేర్‌ 1.6 శాతం పెరిగి రూ.384 వద్ద ముగిసింది.

➡️