న్యూఢిల్లీ : బంధన్ ఎఎంసి కొత్తగా గిప్ట్ సిటీలో కార్యకలాపాలను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ సందర్బంగా మూడు ఫండ్స్ను ఆవిష్కరించడంతో పాటుగా వాటిపై దృష్టి కేంద్రీకరించినట్లు ప్రకటించింది. ఇందులో బంధన్ ఇండియా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ (ఐఎఫ్ఎస్సి), బంధన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, బంధన్ ఇండియా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫండ్ పథకాలున్నాయని వెల్లడించింది. వీటిల్లో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థగత మదుపర్లు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్, ఇన్స్ట్యూషనల్ ఇన్వెస్టర్లు, పెన్షన్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎంఎఫ్ వృద్ధిలో భాగం అయ్యేలా చేయాలని నిర్దేశించుకున్నట్లు తెలిపింది.
