న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ) మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 82 శాతం వృద్ధితో రూ.2,626 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. బిఒఐ కీలక నికర వడ్డీ ఆదాయం 2 శాతం పెరిగి రూ.6,063 కోట్లుగా నమోదు చేసింది. ఇతర ఆదాయం దాదాపు రెట్టింపై 96 శాతం పెరిగి రూ.3,428 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల జారీలో 12-13 శాతం, డిపాజిట్లలో 11-12 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బిఒఐ సిఇఒ, ఎండి రజ్నీష్ పేర్కొన్నారు.
