న్యూఢిల్లీ : బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. వరుసగా ఐదో రోజూ పెరిగాయి. గురువారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరిగి రూ.99,750కి చేరింది. 22 క్యారెట్లపై రూ.550 పెరిగి రూ.91,450 వద్ద ముగిసింది. దీంతో 10 పసిడి మళ్లీ రూ.లక్షకు చేరువైనట్లయ్యింది. కిలో వెండి ధర యథాతథంగా రూ.99,000గా నమోదయ్యింది.
