బెంగళూరు : ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ తన వస్తువుల పికప్ అండ్ డ్రాప్ కోసం తీసుకొచ్చిన ‘స్విగ్గీ జీనీ’ సేవలను నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, ముంబయి, న్యూఢిల్లీ తదితర చోట్ల ప్రస్తుతం ఈ సేవలు లభించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా అందుబాటులో లేవని చెబుతోంది. 2020 ఏప్రిల్లో స్విగ్గీ ఈ జీనీ సేవలను ప్రారంభించి.. దాదాపు 70 నగరాలకు విస్తరించింది. సేవల రద్దుపై స్విగ్గీ అధికారికంగా ప్రకటన చేయలేదు.
