గూగుల్‌లో మళ్లీ ఉద్వాసనలు

శాన్‌ఫ్రాన్సిస్కో : టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఈ ఏడాదిలో వరుసగా రెండో సారి ఉద్యోగులపై కన్నెర్ర చేసింది. పునర్‌వ్యవస్థీకరణ చర్యలో భాగంగా సేల్స్‌, పార్ట్‌నర్‌షిప్‌ విభాగాలను పర్యవేక్షించే తమ గ్లోబల్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌లో 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం. తమ ఖాతాదారులకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ సర్దుబాట్లు తప్పడం లేదని గూగుల్‌ వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియాలో రిపోర్టులు వస్తోన్నాయి. గడిచిన ఏప్రిల్‌లోనే తమ ప్లాట్‌ఫామ్‌, డివైజ్‌ యూనిట్లలో పనిచేసే వందల మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది. గతేడాది డిసెంబరులోనూ మేనేజర్‌, డైరెక్టర్లు, వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాల్లో పనిచేస్తున్న వారిలో 10 శాతం మందికి ఉద్వాసన పలికింది. వరుస తొలగింపులు ఆ సంస్థలో పని చేస్తోన్న ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది.

➡️