హైదరాబాద్ : ఆటోమొబైల్ కంపెనీ ఇసుజు మోటార్స్ ఇండియా దేశ వ్యాప్తంగా ‘ఇసుజు ఐ-కేర్ వింటర్ క్యాంప్’ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 9 నుంచి 14వ తేది వరకు తమ అన్ని అధీకృత డీలర్ సర్వీసు అవుట్లెట్లో ఈ సేవలను పొందవచ్చని పేర్కొంది. ఈ కాలంలో, కస్టమర్లు తమ వాహనాలకు తగ్గింపు ధరలతో సర్వీసు సేవలు సహా ప్రత్యేక ఆఫర్లు, ప్రయోజనాలను కూడా పొందవచ్చని తెలిపింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/12/b-isuzu.jpg)