హైదరాబాద్ : ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ మీషో ప్రస్తుత పండగ సీజన్ సందర్భంగా సెప్టెంబర్ 27 నుంచి మీషో బ్లాక్ బస్టర్ సేల్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు అనేక సరసమైన ఎంపికలను అందించడానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 30 కేటగిరీలలో 20 లక్షల మంది విక్రయదారులు దాదాపు 12 కోట్ల ఉత్పత్తులను తమ వేదికపై విక్రయానికి అందుబాటులోకి తెస్తున్నారని తెలిపింది.
