సామ్‌సంగ్‌ నుంచి నియో క్యూఎల్‌ఇడి టివిలు

May 8,2025 21:35 #Business, #Neo QLED TVs, #samsung

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ కొత్తగా 2025 శ్రేణీ నియో క్యుఎల్‌ఇడి 8కె, నియో క్యుఎల్‌ఇడి 4కె, ఒఎల్‌ఇడి, ది ఫ్రేమ్‌ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు వెల్లడించింది. వీటి ధరల శ్రేణీ రూ.49,490-రూ.11 లక్షలుగా ఉందని పేర్కొంది. కొత్త తరం టివిల్లో ఎఐ సాంకేతికత సహా పలు అధునాతన ఫీచర్లున్నాయని ఆ కంపెనీ సీనియర్‌ డైరెక్టర్‌, హెడ్‌ (విడి విభాగం) విప్లేశ్‌ దంగ్‌ తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా 55 అంగుళాలు, అంతకంటే పెద్ద తెర టివిలపై దృష్టి పెట్టామన్నారు. ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నామన్నారు.

➡️