పేటియంకు రూ.540 కోట్ల నికర నష్టాలు

న్యూఢిల్లీ : ప్రముఖ ఫిన్‌టెక్‌ వేదిక పేటియం మాతృసంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ 2024-25 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.539.8 కోట్ల నష్టాలను చవి చూసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.549.6 కోట్ల నష్టాల పాలయ్యింది. డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.208 కోట్ల నష్టాలు ప్రకటించింది. గడిచిన క్యూ4లో ఆ సంస్థ రెవెన్యూ 15.69 శాతం పతనమై రూ.1,911.5 కోట్లుగా చోటు చేసుకుంది. 2023-24 ఇదే క్యూ4లో ఏకంగా రూ.2,267.1 కోట్ల రెవెన్యూ సాధించింది. మంగళవారం మార్కెట్లు ముగిసిన తర్వాత పేటియం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బిఎస్‌ఇలో 5.72 శాతం పతనమై రూ.816.50 వద్ద ముగిసింది.

➡️