ముంబయి : పాక్తో ఉద్రిక్తతల వేళ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహారిస్తున్నారు. దీంతో మంగళవారం బిఎస్ఇ సెన్సెక్స్ 156 పాయింట్లు లేదా 0.19 శాతం పతనమై 80,641కు పరిమితమయ్యింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 82 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 24,379.60 వద్ద ముగిసింది. మాక్డ్రిల్స్ నిర్వహించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తొచ్చన్న అంచనాలతో మదుపర్లు అమ్మకాలకు దిగారు. దీనికి తోడు తమ దేశంలో ఔషధాల ఉత్పత్తికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఫార్మా కంపెనీల షేర్లు ఒత్తిడికి గురైయ్యాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, టాటా మోటార్స్, ఎస్బిఐ, అదానీ పోర్ట్స్, ఎన్టిపిసి షేర్లు అధికంగా నష్టపోగా.. భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా షేర్లు లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
