మార్కెట్లు ఇటీవలి పటిష్టమైన ర్యాలీ అనంతరం మళ్లీ నిలకడైన కాంపౌండెడ్ ప్రయోజనాలు ఇచ్చే స్టాక్స్వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉందని టాటా అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ సోనమ్ ఉదాసీ పేర్కొన్నారు. టారిఫ్లపరంగా కఠినతర పరిస్థితులు నెలకొన్న తరుణంలో దేశీయ పరిస్థితుల ఆధారిత రంగాలు ఫైనాన్షియల్స్, యుటిలిటీస్, ఎనర్జీ, సిమెంట్, పెట్రోకెమికల్స్, సర్వీసెస్, డిఫెన్సివ్ ఎఫ్ఎంసిజి వంటి స్థిరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. భారతీయ ఈక్విటీ మార్కెట్ అప్రమత్తతతో కూడుకున్న ఆశావహ దశలో ఉందన్నారు. 2024-25 చివరి త్రైమాసికంలో చాలా కంపెనీలు చెప్పుకోతగ్గ ఆదాయ వృద్ధి సాధించినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధాల విస్తృత ప్రభావాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయని టాటా అసెట్ మేనేజ్మెంట్ పేర్కొంది.
