ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో భారత రూపాయి విలువ వెలవెలబోతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణానికి తోడు డాలర్ విలువ పెరగడంతో రూపాయి రికార్డ్ పతనాన్ని చవి చూసింది. మంగళవారం డాలర్తో రూపాయి మారకం విలువ 8 పైసల మేర పతనమై రూ.83.53కు క్షీణించింది. ఇంతక్రితం సెషన్లో 83.45 వద్ద ముగిసింది. డాలర్ విలువ ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఆసియన్ కరెన్సీల విలువ పడిపోయింది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఆందోళనలు మరింత పెరిగితే చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురి కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
