
రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ , ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా...అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో అనుకున్నది అనుకున్నట్లు షూటింగ్ చేసుకుంటోంది. రెండు షెడ్యూల్స్ చిత్రీకరణతో 90 శాతం రూపకల్పన పూర్తి చేసుకుంది. ఇటీవలే గోవాలో ముగిసిన రెండో షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ఏ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ...గోవా బ్యాక్ డ్రాప్లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యాంతం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. అభిమన్యు బద్ది డెబ్యూ డైటరెక్టర్ అయినా పక్కా ప్లానింగ్తో వేసిన షెడ్యూల్స్లో షూటింగ్ చేస్తున్నారు. తాజాగా గోవాలో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. దీంతో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇదే స్పీడ్ తో సినిమాను కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, అభరు బెతిగంటి, వైవా హర్ష,బిగ్ బాస్ సిరి తదితరులు నటించారు. ఈ చిత్రానికి హరి గౌర సంగీతాన్ని అందంచారు. ఎడిటర్గా ప్రవీణ్ పూడి,
ఆర్ట్ డైరెక్టర్గా కె. వి రమణ వ్యవహరించారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫి అందించారు.