ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 20, 21, 22, 23 తేదీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. క్యాంపుల్లో ఆధార్ డాక్యుమెంట్స్ అప్డేట్తోపాటు అన్ని ఆధార్ సేవలు అందించనున్నట్లు పేర్కొంది. వీటితోపాటు ఇతర ముఖ్య సేవలు కూడా ప్రజలకు అందించనున్నట్లు తెలిపింది.