ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రుల హత్య
ట్రాక్టర్తో గుద్ది చంపిన వైనం
ప్రజాశక్తి-పూసపాటిరేగ : ఆస్తి కోసం కన్న కొడుకే కాలయముడై తల్లిదండ్రులను ట్రాక్టర్తో ఢ కొట్టి ఆయువు తీసేసిన సంఘటన శనివారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చల్లవానితోట పంచాయతీ పరిధిలోని బూర్లెవాని కళ్లాలు వద్ద చోటుచేసుకుంది. ఆస్తి ఇవ్వడం లేదని తల్లిదండ్రులపై పగ పెంచుకున్న పాండ్రంకి రాజశేఖర్ తన తల్లిదండ్రులు పాండ్రంకి అప్పలనాయుడు (55), పాండ్రంకి జయమ్మను (53) తమ సొంత ట్రాక్టర్తో ఢకొీట్టాడు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. అప్పలనాయుడు, జయమ్మకు దంపతులకు కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధ ఉన్నారు. వీరికి 80 సెంట్లు పొలం ఉంది. గత కొంత కాలం క్రితం కుమార్తె రాధకు వివాహమైంది. ఆమె భర్త అకాల మరణం చెందాడు. దాంతో తల్లిదండ్రులు తన కున్న 80 సెంట్లు భూమిలో 20 సెంట్లు కుమార్తెకు రాసేసినట్లు రాజశేఖర్ తెలుసుకున్నాడు. అప్పటి నుండి ఇంట్లో తగాదాలు జరుగుతున్నాయి. విషయం గ్రామ పెద్దల వద్దకు వెళ్లింది. తరుచూ వివాదం చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరుగా రెల్లివలసలో అద్దె ఇంట్లో రాజశేఖర్ ఉంటున్నాడు. శనివారం పొలం దగ్గర తల్లిదండ్రులకు, కుమారుడికి స్వల్ప వివాదం జరిగింది. దాంతో ఆస్తిని తనకు ఇవ్వడం లేదనే కోపంతో తన సొంత ట్రాక్టర్తో పొలంలో ఉన్న తల్లిదండ్రులను బలంగా ఢకొీట్టాడు. ఈ ఘటనలో తల్లిదండ్రులు అక్కడకక్కడే విగతజీవులుగా పడిపోయారు. తల్లిదండ్రులు చనిపోయారని గ్రహించిన రాజశేఖర్ ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. ఈ వార్త దావాలంలా వ్యాపించింది. ఒక్కసారిగా పూసపాటిరేగ మండలం ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న గ్రామస్ధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్ధలానికి విజయనగరం డిఎస్పి శ్రీనువాసరావుతోపాటు క్లూస్టీం, భోగాపురం రూరల్ సిఐ వెంకటరావు, ఎస్ఐ దుర్గాప్రసాద్ చేరుకున్నారు. ప్రమాదం తీరును గ్రామస్ధులను అడిగి తెలుసుకున్నారు. సిఐ వెంకటరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామ పెద్దలు పతివాడ శ్రీను, మహంతి చిన్నంనాయుడు, మహంతి శంకరావు తదితరులు మృతదేహాలను సందర్శించారు. సంఘటన స్ధలానికి చేరుకొని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని చల్లవాని తోట పంచాయతీ పరిధిలో గల నడుపూరు వారి కల్లాల వద్ద ఆస్తి తగాదాలతో కన్న కొడుకే తల్లిదండ్రులను హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. తనకు ఆస్తి ఇవ్వడం లేదని కక్ష పెట్టుకున్న కుమారుడు పాండ్రంకి రాజశేఖర్ తన తల్లిదండ్రులు పాండ్రంకి జయమ్మ(55), పాండ్రంకి అప్పలనాయుడు (60)ను ట్రాక్టర్తో గుద్ది చంపేశాడు. పాండ్రంకి అప్పలనాయుడు (60), పాండ్రంకి జయమ్మ (55) ను పాండ్రంకి రాజశేఖర్ ట్రాక్టర్ తో గుద్ది చంపేశాడు. తల్లిదండ్రులు మతి చెందారని తెలుసుకున్న రాజశేఖర్ విజయనగరం టూ టౌన్ లో సరెండర్ అయ్యాడు. పూసపాటి రేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు