జోగింపేట ప్రాథమిక పాఠశాలను డిఇఒ సందర్శన

 ప్రజాశక్తి – సీతానగరం :  మండలంలోని జోగింపేట ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్‌.ప్రేమ్‌ కుమార్‌ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ఆహారాన్ని అందించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఇఒ జి.సూర్యదేవుడు, ఎం.వెంకటరమణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️