మోసపోయిన కౌలు రైతు – గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి-ఇంకొల్లు (బాపట్ల) : పొగాకు కొంటానని చెప్పి ఓ కౌలు రైతును మోసగించడంతో ఆ రైతు అప్పులపాలై గత్యంతరం లేక గడ్డిమందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఘటన శనివారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామంలో జరిగింది. దుదుకూరుకు చెందిన బిల్లా సాంసొన్‌, అనే రైతు 25 ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని నల్లబర్లి పొగాకు సాగు చేశాడు. అయితే ఇప్పటివరకు పొగాకు ఒక్క చెక్కు కూడా అమ్ముడుపోలేదు. ఇప్పటివరకు పొగాకు చెక్కులతొక్కిన కూలీలకు కూలి కూడా ఇవ్వలేదు. గ్రామస్తుల కథనం ప్రకారం … జిపిఐ కంపెనీకి చెందిన ప్రసాదు అనే కంపెనీ ఉద్యోగి గ్రామానికి వచ్చి పొగాకు మండేను పరిశీలించాడు. పొగాకు చెక్కులు తొక్కు పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పాడు. ఆ ఉద్యోగి చెప్పిన విధంగా మండేను పొగాకు చెక్కులు తొక్కాడు. అయితే ప్రసాదు అనే ఉద్యోగి పొగాకు నీది బాగాలేదు కొనుగోలు చేయబోము అని చెక్కులతొక్కినాక రైతుకు చెప్పాడు. పొగాకు చెక్కులు తొక్కిన కూలీలకు కూడైనా ఇవ్వాలి మీరు చెప్పినట్లు బేళ్లు కట్టాము కదా కనీసం ఐదు ఆరు చెక్కులయిన కొనుగోలు చేయండి అని శాంసన్‌ ప్రసాదును ప్రాధేయపడ్డాడు. అయినా కూడా కనీసం ఒక్క చెక్కు కూడా కొనుగోలు చేయలేదు. దీంతో మనస్థాపం చెందిన సాంసొన్‌, శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో తమ ఇంటి వద్ద గడ్డి ముందు తాగాడు. పొలం పెట్టుబడికి పెట్టిన అప్పులతో పాటు కనీసం చెక్కులు తొక్కిన కూలీ కూడా ఇవ్వకుండా ప్రసాదు ఆ రైతును మోసం చేశాడు.

➡️