ప్రజాశక్తి – ఆలమూరు : మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీమురళీకృష్ణ సంస్థల అధినేత, కొత్తపేట నియోజకవర్గ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంటిపల్లి పాపారావు తనయుడు వంటిపల్లి మురళీకృష్ణ జన్మదిన వేడుకలు పెద్దపళ్ల శ్రీ మురళీకృష్ణ రైస్ మిల్, ఈతకోట శ్రీకృష్ణ రైస్ మిల్ స్టాఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వారంతా మురళీకృష్ణకు పూలమాలలు బొకేలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురళీకృష్ణ సంస్థల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో సంస్థ అధినేతలు వంటిపల్లి కృష్ణమూర్తి, వంటిపల్లి పాపారావు, కుటుంబ సభ్యులు, సంస్థ స్టాఫ్ పాల్గొన్నారు.