ప్రజాశక్తి-ఏలేశ్వరం (కాకినాడ) : ఏలేశ్వరం మండలంలోని రూరల్, అర్బన్ ఏఎన్ఎం లు తమపై అసత్య ఆరోపణలు మానుకోవాలని కోరుతూ … స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … సమ్మె చేస్తున్న ఎం ఎల్ హెచ్ పి లు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. పగలనకా రేయి అనక ప్రజా ఆరోగ్యం కోసం పాటుపడుతున్న తమపై ఎంఎల్ హెచ్పి లు చేస్తున్న ఆరోపణలు నిరాహారమన్నారు. వారికి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకోవాలి కానీ ఏఎన్ఎం పై ఆరోపణలు చేయడమేమిటిని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పి హెచ్ ఓ మాణిక్య కుమారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అర్బన్, రూరల్ ఏ ఎం ఎం లు ఉన్నారు.
