పాదయాత్రలో అపశృతి

Apr 27,2025 12:01 #East Godavari

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద 16 నంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు.. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం..  దేవరపల్లి గ్రామానికి చెందిన, దాసు దుర్గాప్రసాద్, అంజి, మరో వ్యక్తి కలసి శనివారం రాత్రి పాదయాత్రగా బయలుదేరి ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల  వెంకన్న సన్నిధికి రోడ్డుపై నడిచి వెళుతూ ఉండగా నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్దకు వెళ్లేసరికి రాజమండ్రి వైపు నుంచి విజయవాడ వైపుకు కర్ణాటకకు చెందిన లారీ ఢీకొట్టడంతో దాసు దుర్గాప్రసాద్ కు తీవ్ర గాయాలు కాగా, అంజి, మరో వ్యక్తికి, స్వల్ప గాయాలు అయ్యాయి. దుర్గాప్రసాద్ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అంజి మరో వ్యక్తి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

➡️