ప్రజాశక్తి – కురుపాం : మండలంలోని మొండెం ఖల్, నీలకంఠపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ కె.వి.ఎస్ పద్మావతి గురువారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలు, ఎన్సిడి, సిడి సర్వేలు గూర్చి వైద్య సిబ్బందికి అడిగి తెలుసుకొని నేరుగా రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గూర్చి ఆరా తీశారు. అనంత రం మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పల్లంబారిడిలో దోమల నివారణకు చేపడుతున్న ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ పర్యవేక్షించి స్ప్రేయింగ్ జరగబోయే గ్రామాలను సబ్ యూనిట్ అధికారులు ముంద స్తుగా తెలియజేసి క్షేత్ర స్థాయిలో ఫీవర్ సర్వే పక్కాగా చేపట్టి జ్వరాలు ప్రబలకుండా చూసుకోని ఇంటింటికీ దోమల మందు పిచికారీ చేసిన ఇళ్లకు మార్కింగ్(ఎండార్స్మెంట్) పక్కాగా ఉండాలని సూచించారు. స్ప్రే చేస్తున్న సిబ్బంది మాస్క్,కళ్లజోళ్ళు,చేతి తొడుగులు ధరించేలా చూసుకుని ఐఆర్ఎస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్ర మంలో వైద్యాధికారులు డాక్టర్ బి.ప్రజ్ఞ, అమరసింహారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
