జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ప్రజాశక్తి- బంగారుపాళ్యం (చిత్తూరు జిల్లా) : జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడి వీర మరణం పొందిన కార్తీక్‌ యాదవ్‌ అంత్యక్రియలు బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానిపెంటలో నిర్వహించారు. మధ్యాహ్నం 3.45 గంలలకు ఆర్మీ అధికారులు, స్థానిక పోలీసులు జవాను అంతిమ యాత్రను ఎగువ రాగిమానిపెంట గ్రామ వీధుల గుండా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటితో అమర జవానుకు తుది వీడ్కోలు పలికారు. జవాను అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు కె.మురళి మోహన్‌, గురజాల జగన్మోహన్‌, చిత్తూరు నగర మేయర్‌ అముద, చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలమనేరు ఆర్‌డిఒ భవాని, బంగారుపాళ్యం తహశీల్దార్‌ బాబు రాజేంద్రప్రసాద్‌, 4/8 గుర్ఖా రైఫిల్‌ బెటాలియన్‌ లెఫ్టినెంట్‌ శివరాజ్‌ సింగ్‌ గిల్‌ పాల్గొని నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో ఆర్మీ సిబ్బంది, పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

పదేళ్ల క్రితం ఆర్మీలో చేరిన కార్తీక్‌ యాదవ్‌ రాజస్థాన్‌ ఆర్మ్‌డ్‌ రెజిమెంట్‌లో ఏడేళ్లపాటు పని చేశారు. రెండేళ్ల క్రితం జమ్మూకు బదిలీ అయ్యారు. జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు. కార్తీక్‌ మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, మంత్రి నారా లోకేష్‌, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వీరజవాన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.

డెత్‌ సర్మనీ పరేడ్‌ లో 4/8 గురా రైఫిల్‌ బెటాలియన్‌ లెఫ్టినెంట్‌ శివరాజ్‌ సింగ్‌ గిల్‌ నేతృత్వం లో 35 మందితో పెరేడ్‌ నిర్వహించి గౌరవ వందనం చేశారు. 23 మంది పెరేడ్‌ చేసి గాలిలోకి కాల్పులు చేశారు. అనంతరం అంత్య క్రియలను పూర్తి చేశారు. ఈ అంతిమ సంస్కారానికి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, పూతల పట్టు, చిత్తూరు శాసనసభ్యులు కె.మురళి మోహన్‌, గురజాల జగన్మోహన్‌, చిత్తూరు నగర మేయర్‌ అముద, చుడా చైర్‌ పర్సన్‌ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పలమనేరు ఆర్డిఓ భవాని బంగారు పాళ్యం తాసిల్దార్‌ బాబు రాజేంద్రప్రసాద్‌, మాజీ సైనికుల సంక్షేమ సంఘం, ఎం ఈ జీ సంఘం, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు.

జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన పంగల కార్తీక్‌ యాదవ్‌ (28) స్వగ్రామం బంగారు పాళ్యం మండలం ఎగువ రాగిమాను పెంట. వీరి తల్లిదండ్రులు సెల్వి , వరదరాజులు, అన్న రాజేష్‌. పదేళ్ల క్రితం ఆర్మీ లో చేరిన కార్తీక్‌ యాదవ్‌ రాజస్థాన్‌ ఆర్మ్‌ డ్‌ రెజిమెంట్‌ లో ఏడేళ్ల పాటు పనిచేశాక రెండేళ్ల క్రితం జమ్మూకు బదిలీ అయ్యారు. ఉగ్రవాదులను ఏరివేసే కూంబింగ్‌ రైఫిల్‌ విభాగంలో పనిచేస్తున్నారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదులతో జరిగిన పోరు లో కార్తీక్‌ తీవ్రంగా గాయపడి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. వీర జవాన్‌ మరణ వార్త పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి మండి పల్లి రాంప్రసాద్‌ రెడ్డి, మంత్రి నారా లోకేష్‌, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద రావు, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వీర జవాన్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని తెలిపారు.

ఉగ్రవాద కాల్పుల్లో జవాను వీరమరణం

➡️