త్రాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి

Apr 25,2025 17:15 #Konaseema

ప్రజాశక్తి – ఆలమూరు : పల్లెల్లో శివారు నివాస ప్రాంతాల ప్రజలకు ఏటువంటి త్రాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ డిఎల్పిఓ, ఎంపీడీవో ఏ.రాజు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఎస్.రవికుమార్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శుల సమీక్ష సమావేశంలో వారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పి.పద్మ సమక్షంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రాగునీటి సరఫరా విభాగంలో ఏ విధమైన అలసత్వం తగదన్నారు. నీటి సరఫరా గొట్టాలు పగిలి వృధాగా మీరు నీరు పోవడం వంటివి వెంటనే అరికట్టాలన్నారు. అలాగే సరఫరా లైన్లో కొందరు స్వలాభం కోసం మోటార్ పంపు చెట్లను ఏర్పాటు చేసుకుని శివారు ప్రాంతాలకు తాగునీరు అందకుండా చేసినట్లయితే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శులకు ఆదేశించారు. కూటమి ప్రభుత్వ నిర్దిష్టమైన ఆదేశాలు మేరకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ త్రాగునీరు వినియోగదారులకు పరిపూర్ణంగా అందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే మీకు పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు వెంకటరత్నం, విజయ రెడ్డి, సాయి ప్రసాద్, వీర్రాజు, వెంకట్ రెడ్డి, అయ్యన్న, మోక్షంజలి, వీరమాత, వేణి, శబరి, హరే రామ్ రెడ్డి, నవీన్, పద్మావతి, వీరన్న చౌదరి, రాంబాబు, సుభాష్ పోలరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️