ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చొప్పెల్లలో రైతులకు అడ్వాంటా గోల్డెన్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు బెండ సాగుపై అవగాహన సదస్సు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టెరేటరీ సేల్స్ మేనేజర్ కె.రాజు కుమార్, మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పి.సత్య వర ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు హైబ్రిడ్ బెండ సాగులో ఎటువంటి విత్తనాలు వేయాలో, అధిక దిగుబడి, దీర్ఘకాలిక పలదీకరణ, రోగ నిరోధికత, ఆకర్షనీయమైన రంగు, ఆకారాలు ఎలా సాధించాలో వివరించారు. భూ స్థితి దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంతవరకు ఏ విధంగా సాగు చేయాలో తగిన సలహాలు, సూచనలతో క్షుణ్ణంగా తెలిపారు. అలాగే కాసా హైబ్రిడ్ బెండీ ఏడివి 842 రకం విత్తనాలు గురించి రైతులకి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ రైతులు పాల్గొన్నారు.
