ప్రజాశక్తి – క్రోసూరు : వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, విప్పర్ల దళితులపై గతంలో పెట్టిన కేసును కోర్టు కొట్టేసింది. విప్పర్ల గ్రామంలో దళితులకు ఇచ్చిన భూముల్లో 2019లో డంపింగ్ యార్డ్ నిర్మాణాలు చేపడుతుండగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ అప్పటి పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేయగా జి.రవిబాబుతోపాటు స్థానికులైన చిలకా దేవదాసు, కంభంపాటి పౌలు, చిలక నాగరాజు, చిలక ప్రకాశరావు, చిలకా చిట్టిబాబుపై కేసు నమోదైంది. కేసును విచారించిన సత్తెనపల్లి 1వ అదనపు జూనియర్ న్యాయమూర్తి కేసును శుక్రవారం కొట్టేశారు.
