చిన్నారిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి:-ఐద్వా

May 9,2025 17:01 #accused, #aidwa, #nandyala, #punished, #pyapili

ప్రజాశక్తి -ప్యాపిలి :   చిన్నారిని హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని ఐద్వా నాయకురాలు షమీం బేగం డిమాండ్‌ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు భద్రత కల్పించాలని ఆస్పత్రి ఎదుట ఎదుట శుక్రవారం ఐద్వా నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం చిన్నారి మఅత దేహానికి ఐద్వా నాయకురాలు షమీం బేగం, మాధవి, షబానా, లక్ష్మీదేవి బఅందం నివాళి అర్పించారు. ఐద్వా నాయకురాలు షమీం బేగం మాట్లాడుతూ గోరంట్ల గ్రామానికి చెందిన చిన్నారిని ఎరుకలచెరువు గ్రామానికి చెందిన ఎల్లప్పకు గత ఐదు నెలల క్రితం వారు అడిగినంత కట్నం కానుకలు ఇచ్చి పెద్దలు పెళ్లి చేశారని అన్నారు. నెల గడవకముందే మరింత డబ్బులు తీసుకురావాలని మామ, అత్త – నరసింహులు,హనుమక్క, భర్త ఎల్లప్ప, బావ వీఆర్వో ప్రహ్లనాద్‌ పథకం ప్రకారం హత్య చేశారని అన్నారు. మూడు నెలల నిండు గర్భిణీ అని కూడా చూడకుండా చిన్నారిని హత్య చేసి, దానిని కప్పిపుచ్చేందుకు ఆత్మహత్య చేసుకుందని కట్టు కథలు అల్లారని వారు అన్నారు. వారు చేసిన హత్య బయటపడడంతో రాత్రికి రాత్రి అత్తా, మామ,భర్త,బావ అదఅశ్యమై తలదాచుకున్నారని ఇలాంటి వారిని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళా హౌంమంత్రి ఉన్న మహిళలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య (ఐద్వా) ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. అదనపు కట్నాల కోసం మహిళలను వేధిస్తూ హత్యలు చేస్తున్న ఇలాంటి దుర్మార్గులకు ఏ రాజకీయ నాయకులు వత్తాసు పలకకూడదని అన్నారు. నిందితులను అరెస్ట్‌ చేయకుంటే పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

➡️