ప్రజాశక్తి -జి.మాడుగుల:ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నుర్మతి అవుట్ పోస్ట్, మెయిన్ రోడ్డు కల్వర్టు, బస్టాండ్లను బాంబ్ డిస్పోజల్ టీం డాగ్ తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ, కొత్త వ్యక్తులు గ్రామాలలోకి వస్తే సమాచారం చేరవేయాలన్నారు. సీఐ చేతుల మీదుగా పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని సూచించారు.
