ప్రజాశక్తి-పాడేరు: బ్రిటిష్ వారిని ఎదిరించడంలో అల్లూరి సీతారామరాజు త్యాగం చిరస్మరనీయమని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ కొనియాడారు. బుధవారం అల్లూరి వర్ధంతి పురష్కరించుకొని కలెక్టరేట్ ఆవరణలో అల్లూరి విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారనీ, శ్రమదోపిడి, ఆస్తుల దోపిడి, మన్యంలో గిరిజనుల జీవితం దుర్భరంగా ఉండేదన్నారు. అటువంటి సమయంలో తెల్లదొరల దోపిడీని అల్లూరి సీతారామ రాజు ధైర్యతో ఎదుర్కోన్నారన్నారు. అల్లూరి సీతారామ రాజుకు మన జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. అల్లూరి పేరుతో ఏర్పడిన జిల్లాలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం జే అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ట్రైనీ కలెక్టర్, కనల చిరంజీవి నాగ వెంకట సాహిత్, డి ఆర్ఓ కె.పద్మలత పాల్గొన్నారు. పాడేరు ఐటిడిఎలో కూడా అల్లూరి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సంయుక్త కలెక్టర్, ఐటిడిఎ ఇంచార్జ్ ప్రాజెక్ట్ అధికారి ఎంజే అభిషేక్ గౌడ ఐటిడిఎలో గల అల్లూరి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఒ హేమలత, ఎపిఒ ఎం. వెంకటేశ్వర రావు, ఐటిడిఎ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఫొటో ఫోటో రైటప్ : నివాళులర్పిస్తున్న ఐటిడిఎ పిఒ, సిబ్బందిరంపచోడవరం : ఐటిడిఎ సమావేశ భవనంలో అల్లూరి సీతారామరాజు వర్దంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఐటిడిఎ పిఎ కట్టా సింహాచలం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్య్రం కోసం బ్రిటిష్ వారిపై ఆయన పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఒ జనరల్ డిఎన్వి రమణ, డిఈ చైతన్య, ఎస్టిఒ పాపారావు, సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ సూపరింటెండెంట్లు బి.కిషోర్, రాజారెడ్డి, ఐటిడిఎ మేనేజర్ బి.రాజు, సీనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసరావు, పి. వెంకటేశ్వరరావు, చక్రధర్, లక్ష్మి, ప్రభాకర్రావు, ప్రధానోపాధ్యాయులు బి.నాగేశ్వరరావు, ఎంపిహెచ్ఒ కుసుడు, తదితరులు పాల్గొన్నారు.
