ప్రజాశక్తి -పాడేరు:- నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల మనుగడకు విఘాతం కలుగుతోందని పాడేరులో శుక్రవారం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. నూతన విద్యావిధానం పేరుతో రకరకాల పాఠశాలలు ఏర్పాటు చేసి గందర గోళం చేస్తున్నారన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారని,. దీని మూలంగా ప్రభుత్వ బడులలో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిఆర్ఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు రావుల. జగన్ మోహన రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్ర.ధనుర్జరు, ఉపాధ్యక్షులు.శ్యాంసుందరం, నాగేశ్వరరావు సబ్ కమిటీ సభ్యులు. రామారావు, బట్టి చిన్నారావు, శాంతకుమారి, మండలం అధ్యక్షులు పోతురాజు, అధ్యక్షా ప్రధాన కార్యదర్శులు. సత్యారావు, కన్నారావు పాల్గొన్నారు.
