గంజాయితో యువత భవిష్యత్‌ నాశనం

Apr 27,2025 00:04
ర్యాలీ చేపడుతున్న సొసైటీ సభ్యులు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:మండలంలోని లోతేరు వారపు సంతలో గంజాయితో కలిగే అనర్థాలపై ట్రైబల్‌ ఫ్యామిలీ వెల్పేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రైబల్‌ ఫ్యామిలీ వెల్పేర్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ కిల్లో అప్పలస్వామి మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలు సేవించరాదన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్‌ కార్యాచరణాన్ని రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో చదువుకున్న యువత ఉన్నారని, చెడు దారులకు వెళ్లకుండా తమ జీవితాలకు మంచి మార్గాలను ఎంచుకోవాలన్నారు. ఐటిడిఎ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మూఢనమ్మకాలు విడనాడాలని, వాటిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకోకూడదని అవగాహన పరిచారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️